హైదరాబాద్, మార్చ్ 21: ఐపీఎల్ 2019 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కి ఓ శుభవార్త అందింది. భుజానికి గాయమవడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫిట్నెస్ సాధించి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. శుక్రవారమే అతను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరబోతున్నట్లు ఫ్రాంఛైజీ ప్రకటించింది. బాల్ టాంపరింగ్ ఉదంతంతో గత ఏడాది నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు అందుకున్న కేన్ విలియమ్సన్.. బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుని ఏకంగా ఫైనల్కి చేర్చాడు. దీంతో.. ఈ ఏడాది వార్నర్ మళ్లీ జట్టులోకి వచ్చినా.. విలియమ్సన్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది. దీంతో.. ఓపెనర్గా మాత్రమే వార్నర్ టీమ్లో కొనసాగనున్నాడు. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్లో ఢీకొననుంది.