నితిన్ సాహసం చేస్తున్నాడా..?

SMTV Desk 2019-03-22 11:41:17  Nithin,

యంగ్ హీరో నితిన్ ఈ రోజు హోలీ సందర్భంగా తన కొత్త చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. డైరెక్టర్ సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో ఒక సినిమా చేయనున్నాడు నితిన్. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనుందని ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడని ట్వీట్ చేశాడు నితిన్. ఇక ఈ చిత్రం తో పాటు నితిన్’ రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ తో ఒక సినిమా చేయనున్నాడట. అయితే ఈ ఇద్దరి దర్శకుల ట్రాక్ రికార్డ్ చూస్తే నితిన్ ఫ్యాన్స్ కాస్త గాభరా పడడం ఖాయం, ఎందుకంటే ఇద్దరూ గతంలో చాలా సినిమాలు చేసినా అందులో ఒక్కటీ కమర్షియల్ హిట్ లేదు. దీంతో ఆయన సాహసం చేస్తున్నాడా అనే అనుమనాలు మొదలయ్యాయి. ఇప్పటికే నితిన్ కష్ట కాలంలో ఉన్నాడు. గత కొన్నాళ్ళగా ఒక్కటీ సరయిన హిట్ లేకపోవడంతో హీరో నితిన్ డీలా పడ్డాడు. శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత మనోడు ఏ సినిమా ఒప్పుకోలేదు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చినా దాని మీద ఇంకా అధికారిక ప్రకటన లేదు. దీంతో నితిన్ ఫ్యాన్స్ లో గందరగోళం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇద్దరు డిజాస్టర్ డైరెక్టర్స్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించడంతో మళ్ళీ ఆయన ఫ్యాన్స్ లో గందరగోళం మొదలయ్యింది.