గురువారం మధ్యాహ్నం సిఎం కేసీఆర్ తెరాస లోక్సభ అభ్యర్ధుల జాబితాను విడుదల చేయబోతున్నారు. జాబితాను ఖరారు చేసే ముందు బుదవారం మరొకసారి వివిద జిల్లాల తెరాస నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ నియోజకవర్గాలవారీగా సుదీర్గంగా చర్చించారు. ఊహించినట్లుగానే మహబూబ్నగర్, మహబూబాబాద్ సిటింగ్ ఎంపీలు జితేందర్ రెడ్డి, సీతారాంనాయక్ లను కేసీఆర్ పక్కన పెట్టారు. హైదరాబాద్ అభ్యర్ధిని ఈరోజు ఖరారు చేసి ప్రకటిస్తారు. తెరాస అభ్యర్ధుల జాబితా ఈవిధంగా ఉండబోతోందని సమాచారం.
1. మహబూబ్నగర్: మన్నే శ్రీనివాస్ రెడ్డి
2. మహబూబాబాద్: మాలోతు కవిత
3. ఖమ్మం: నామా నాగేశ్వరరావు
4. చేవెళ్ళ: కార్తీక్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి
5. సికిందరాబాద్: తలసాని సాయి కిరణ్
6. నిజామాబాద్: కవిత
7. నల్గొండ: గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా కంచకర్ల కృష్ణారెడ్డి
8. భువనగిరి: బూర నర్సయ్య గౌడ్
9. కరీంనగర్: బి. వినోద్ కుమార్
10 మెదక్: కొత్త ప్రభాకర్ రెడ్డి
11. పెద్దపల్లి: జి.వివేక్
12. వరంగల్: పస్నూరి దయాకర్
13. మల్కాజ్గిరి: రంజిత్ రెడ్డి లేదా నవీన్ రావు
14. జహీరాబాద్: బీబీ పాటిల్
15. నాగర్ కర్నూల్: పి రాములు.
16. అదిలాబాద్: జి. నగేశ్.