హోళీ స్పెషల్ ... మసూద్ అజర్ దిష్టిబొమ్మల్ని దహనం చేసేందుకు ఏర్పాట్లు

SMTV Desk 2019-03-21 14:02:51  Holi special,

హోళీ సందర్భంగా కాముని దహనం, రావణుని దహనం చేస్తుంటారు. కానీ ముంబై వాసులు వారి స్థానంలో.. నలభై మంది జావాన్లను పొట్టనపెట్టుకున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌తోపాటు అనేక మంది ప్రాణాలతో చలగాటమాడుతున్న పబ్జీ గేమ్ దిష్టిబొమ్మల్ని దహనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ అని అధికారులు గుర్తించారు. అంతమంది జవాన్లు ప్రాణాలను బలితీసుకున్న రాక్షసుడి దిష్టిబొమ్మను దహనం చేసి, హోళీ పండగ జరుపుకోవాలని ముంబై నగర వాసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల మసూద్ అజర్ దిష్టిబొమ్మల్ని దహనం చేసేందుకు అన్ని ఏర్పాటు చేశారు.

అలాగే ప్రమాదకరమైన గేమ్ పబ్జీ దిష్టిబొమ్మను కూడా కొంతమంది విద్యార్థులు రూపొందించారు. అనేక మంది అమాయకుల ప్రాణాలను పబ్జీ తీస్తోందని, ఈ గేమ్ మాయలో పడి చదువుకు, పనికి దూరమవుతున్నారన్నారు. అలాంటి గేమ్‌ను దిష్టిబొమ్మను కూడా దహనం చేయాలని ముంబైకి చెందిన కొంతమంది విద్యార్థులు పబ్జి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.