బిజెపి కండువా కప్పుకున్న డీకే అరుణ

SMTV Desk 2019-03-21 12:41:10  dk aruna, bjp, congress

హైదరాబాద్‌, మార్చ్ 20: కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి బిజెపి కండువా కప్పుకున్నారు. అయితే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ తొలుత ఆమెతో హైదరాబాద్‌లో సమావేశం అయినట్లు సమాచారం. చర్చల నేపథ్యంలోనే బిజపి అధ్యక్షుడు అమిత్‌షాతో కూడా అరుణ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరడానికి నిర్ణయించుకున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నట్లు తెలిసింది. రాష్ట్రాల వారీగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి డీకే అరుణ బిజెపిలో చేరుతున్నట్లు అమిత్‌షా నేతలకు చెప్పారు. ఈక్రమంలో అమిత్‌షా, కేంద్రమంత్రి నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్‌, మురళీధర్‌రావుల సమక్షంలో మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు డీకే అరుణ బిజెపిలో చేరారు.