హైదరాబాద్, మార్చ్ 2: రాష్ట్ర పంచాయతి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు వివరాలను వాటికి సంబంధిత అధికారికి సమర్పించాల్సి ఉంటుంది అని పంచాయతీరాజ్ అధికారులు ఆదేశించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారితో పాటు ఓడిపోయిన వారు కూడా తమ తమ ఖర్చులు వివరాలు నిర్ధేశిత ప్రొఫార్మాలో సంబంధిత మండల పరిషత్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. లెక్కలు సమర్పించకపోతే తీసుకునే కఠిన నిర్ణయాలకు బలికావల్సి వస్తుంది. ఓడిపోయిన వారు నిర్ణీత గడువులోగా ఖర్చుల వివరాలు సమర్పించకపోతే మూడేళ్లపాటు పోటీలో నిలిచే అర్హతను కోల్పోతారు. అలాగే గెలిచిన వారు ప్రస్తుత పదవిని కోల్పోవడంతో మూడేళ్ల పాటు పోటీలో ఉండకుండా అనర్హత వేటు పడుతుంది. జిల్లాల్లో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన రోజు నుంచి 45 రోజులలోపు ఖర్చుల వివరాలు అందజేయాలి. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా సమర్పించలేదని జిల్లా పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.