పాకిస్తాన్, ఫిబ్రవరి 27: ఈ రోజు ఉదయం పాకిస్తాన్ విమానాలను తరిమికొట్టే నేపథ్యంలో అదృశ్యమైన భారత పైలట్ వర్ధమాన్ అభినందన్ ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ కస్టడీలో వున్నారు. అతడు సురక్షితంగా దేశానికి తిరిగి రావాలని దేశ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. పాకిస్థాన్ విమానాలు భారత భూభాగంలోకి రాగానే పైలట్ అభినందన్తో కూడిన విమానం రంగంలోకి దిగింది. ఓ పాకిస్థాన్ విమానాన్ని నేలకూల్చింది. ఈ పోరాటంలో అభినందన్ అదృశ్యమయ్యారు. ఈ పైలట్ను పాకిస్థాన్ ఆర్మీ అమానుషంగా దాడి చేసినట్లు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా అభినందన్ కాఫీ కప్పు పట్టుకుని ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో మీడియాలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను దక్షిణాదికి చెందిన పైలట్ అని పాకిస్థాన్ తనకు గొప్ప ఆతిథ్యం ఇస్తుందని గౌరవించిందని చెప్పారు. తనకు వివాహం అయ్యిందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అభినందన్ ఆ వీడియోలో సమాధానం చెప్పారు.