ఇస్లామాబాద్, ఫిబ్రవరి 27: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్తో చర్చలకు పచ్చ జెండా ఊపారు. బుదవారం ఆయన ఓ మీడియాతో ఇస్లామాబాద్లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. శాంతియుత వాతావరణంలో చర్చించుకొంటే మంచిదని ఆయన కోరారు. తాము రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టుగా ఆయన ప్రకటించారు. కలిసి కూర్చొని మాట్లాడుకొందామని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అంతం చేయడానికి ఏం చేయాలో చెప్పాలని ఇమ్రాన్ కోరారు. పూల్వామాలో సీఆర్ఫీఎఫ్ దాడి ఘటనకు సంబంధించి విచారణకు భారత్ కావాల్సిన సహాయాన్నితాము అందిస్తామని ఆయన ప్రకటించారు. టెర్రరిజం ప్రోత్సహించడానికి తమకు ఆసక్తి లేదని ఆయన చెప్పుకొచ్చారు. యుద్ధం ప్రారంభిస్తే ఎప్పుడు ఎలా ముగింపుకు గురికానుందో తెలియదన్నారు. గతంలో జరిగిన యుద్ధాలన్నీ ఇలానే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. భారత్ వద్ద ఆయుధాలుంటే మా వద్ద కూడ ఆయుధాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ రెచ్చగొట్టడంతో రెండు యుద్ధ విమానాలను తాము కూల్చివేసినట్టుగా ఆయన ప్రకటించారు.