విచారణకు హాజరుకానున్న రాజీవ్ కుమార్

SMTV Desk 2019-02-08 09:58:45  Rajiv Kumar, Sharadha Chitfund Case, Shillong, Mamatha Banerjee, Kunal Ghosh, TMC

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 08: శారద చిట్ ఫండ్ కేసులో కొలకత్తా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు కు సంబంధించి ఈ నెల 9వ తేదిన మేఘాలయ రాజాధాని షిల్లాంగ్ లో విచారిస్తున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపింది.

ఇటీవల కొలకత్తాలోని రాజీవ్ కుమార్ నివాసం లో విచారణకు వెళ్ళిన సీబీఐ అధికారులను అక్కడి పోలీస్ లు అడ్డుకోవడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్‌ ఘోష్‌ను కూడా ఈ నెల 10న షిల్లాంగ్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది.