అమరావతి, జనవరి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్ట్ ప్రారంభోత్సవానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఆహ్వానించనున్నారు. అలాగే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఆయన సమావేశం కానున్నారు. బుధవారం జరగనున్న బీజేపీయేతర పక్షాల భేటీలోనూ చంద్రబాబు పాల్గొంటారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ కి పయనమయ్యారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు . అనంతరం తిరిగి రాత్రికి హైదరాబాద్కు వస్తారు. ఇలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.