హైదరాబాద్, జనవారి 22: యువ కధానాయకుడు విజయ్ దేవరకొండ గీత గోవిందం వంటి ప్రేమకథా చిత్రంలో తనదైన శైలిలో ప్రేక్షకుల హృదయాలను దోచేసుకున్నాడు. అలాంటి విజయ్ .. త్వరలో మరో ప్రేమకథతో రానున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ చిత్రం తీసిన వెంకీ అట్లూరి విజయ్ కోసం కధ రెడీ చేసాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను సినిమాను ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
దీని తరవాత ఆయన విజయ్ తో వొక రొమాంటిక్ లవ్ స్టోరీ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తారట. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దాని తరవాత క్రాంతిమాధవ్ సినిమాను .. వెంకీ అట్లూరి సినిమాను చేయడానికి విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.