సరిహద్దుల్లో పోరాడుతున్న గోపీచంద్..

SMTV Desk 2019-01-21 19:48:58  Gopi chand, tiru, rajastan, border

హైదరాబాద్, జనవరి 21: గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో వొక చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజే రాజస్థాన్ లో మొదలైంది. రాజస్థాన్ లోని భారత్ - పాక్ సరిహద్దుల్లో యాక్షన్ ఎపిసోడ్ ను దర్శకుడు తిరు తనదైన తరహాలో చిత్రీకరించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేసినా .. గోపీచంద్ కి యాక్షన్ హీరోగానే మంచి క్రేజ్ వుంది. ఇంతవరకూ ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి పూర్తి భిన్నంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఉంటాయి అంటున్నారు.

రాజస్థాన్ లో జరిగే ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రానికి హైలైట్ గా నిలిచిపోతుందని చెబుతున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. కొంతకాలంగా సరైన హిట్ లేని గోపీచంద్ కి, ఈ సినిమాతోనైనా హిట్ దొరుకుతుందేమో చూడాలి.