చెన్నై, జనవరి 21: ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకున్న మారి 2 సీనిమాలోని రౌడీ బేబీ తమిళ్ వెర్షన్ పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ధనుష్, సాయి పల్లవి జోడీతో ఇండియన్ మైకేల్ జాక్షన్ ప్రభుదేవా కొరియోగ్రఫీతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు సౌత్ చిత్ర పరిశ్రమకు సంబంధించి యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా ధనుష్ కొలవెరి.. వుండేది. 2011లో విడుదలైన ఈ పాటకు ఏడేళ్లలో 172 మిలియన్ వ్యూస్ లభించాయి. అయితే ఇప్పుడు కొలవెరి.. ని సాయిపల్లవి, వరుణ్తేజ్ నటించిన ఫిదా సినిమాలోని వచ్చిండే.. పాట బీట్ చేసింది. 2018 సెప్టెంబరులో యూట్యూబ్ విడుదలైన ఈ పాట ఇప్పుడు 173 మిలియన్ వ్యూస్తో అత్యధిక మంది చూసిన సౌత్ పాటగా కొత్త రికార్డు సృష్టించింది.
తాజాగా సాయి పల్లవి మరో పాట రికార్డ్ వ్యూస్ సాధించింది. మారి 2 లో ధనుష్ తో సాయి పల్లవి జత కట్టిన విషయం తెల్సిందే. ఇందులో రౌడి బేబీ పాట హిట్ ఐయింది. ట్యూన్ క్యాచీగా ఉండటమే కాక కోరియోగ్రఫీ, ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్ అదిరింది. సాయి పల్లవి, ధనుష్ జోడి తమ డ్యాన్సులతో మోత మోగించారు. ఇప్పుడీ పాట రెండు వారాల్లోనే100 మిలియన్ వ్యూస్ సాధించింది.