హైదరాబాద్, జనవరి 21: ఈ రోజు ప్రారంభమైన పంచాయతి ఎన్నికల తోడి విడత పోలింగ్ మధ్యాహ్నం వొంటి గంటకు ముగిసింది. 3,701 పంచాయితీల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వొంటి గంట వరకు కొనసాగింది. వొంటి గంట వరకు క్యూలైన్లలో ఉన్న వారికే ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడతలో భాగంగా 4,479 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 769 పంచాయితీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా పంచాయితీలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.