హైదరాబాద్, జనవరి 20: అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సమాధానమిచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని తెరాస ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తామిచ్చిన హామీలపై ఆందోళన అవసరం లేదన్నారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేసినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. సీఎం ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.