రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

SMTV Desk 2019-01-20 13:11:24  Telangana legislative assembly, Speaker Pocharam srinivasreddy, Governor Narashimhan, Sandra venkata veeraiah MLA

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొద్ది సమయం క్రితం ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. శాసనసభలో కొప్పుల ఈశ్వర్, శాసనమండలిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక.. అసెంబ్లీలో సండ్ర వెంకట వీరయ్య ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.