హైదరాబాద్, జనవారై 19: అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా తెరకెక్కుతుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిది అగార్వల్ కథానాయికగా నటిస్తుంది. ఈరోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో జెఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ ను రాత్రి గం.8.30 లకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేయనున్నట్లు పిఆర్ఓ బిఎ రాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఈ సందర్బంగా బిఎ రాజు తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమా ట్రైలర్ ని ప్రీ రిలీజ్ కార్యక్రంలో రాత్రి గం.8.30 లకు విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసారు. ఈ పోస్ట్ లో హీరో హీరోయిన్లకి సంబందించిన రొమాంటిక్ ఫోటో వొకటి పెట్టారు. ఈ ఫోటోలో అఖిల్.. నిది అగర్వాల్ ముద్దు పెట్టుకుంటున్నట్లు చాలా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.
#MrMajnuTrailer Unveiling at 8:30 pm today at #MrMajnuPreRelease.#MrMajnu @AkhilAkkineni8 @AgerwalNidhhi @dirvenky_atluri @MusicThaman @ShreeLyricist @George_DOP @SVCCofficial @SonyMusicSouth #MrMajnuOnJan25th pic.twitter.com/jYBAmg1UhG
— BA Raju's Team (@baraju_SuperHit) January 19, 2019