గాంధీనగర్, జనవరి 19: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పచ్ఛిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈరోజు నిర్వహించిన మెగా ర్యాలీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వారంతా మోదీ వ్యతిరేకులు కాదనీ, దేశానికి, ప్రజలకు, దేశ అభివృద్ధికి వ్యతిరేక శక్తులని విమర్శించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే తమపై వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఈరోజు గుజరాత్లోని సిల్వసాలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ఈవిదంగా మాట్లాడారు.
ప్రభుత్వ ధనాన్ని దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి తనపై కోపం రావడం సహజమేనని ఎద్దేవా చేశారు. కూటమి నాయకులు వొకరినొకరు కలిసి మాట్లాడుకోలేరు గాని అప్పుడే వాటాలను పంచుకోవడం మొదలుపెట్టారని మోదీ ఆరోపించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు మోదీ సిల్వసాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.