మెల్బోర్న్, జనవరి 18: మెల్బోర్న్ వేదికగా టీం ఇండియా-ఆసిస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు చివరి వన్డే నేడిక్కడ జరుగుతోంది. కాగా కోహ్లి సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకోగా ఆసిస్ భారత బౌలర్ల దాటికి మెల్లగా కుప్పకూలిపోతోంది. 19 బంతుల్లో 26 పరుగులు చేసిన మాక్స్ వెల్ షమీబౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో ఆస్ట్రేలియా స్కోరు 34.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు. ఇప్పటి వరకూ ఇరు జట్లూ చెరోమ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా ఉన్నారు. చివరిదైన ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను దక్కించుకోవాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.