మెల్బోర్న్, జనవరి 18: భారత్-ఆసిస్ తో జరుగుతున్న ఆఖరి వన్డేలో కోహ్లీ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. కాగా వన్డే సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్ కావడంతో ఇరు జట్ల వారు ఘన విజయం సాధించేందుకు పట్టుదలతో ఉన్నారు.
ఇదివరకే చెరొక మ్యాచ్ ను గెలుచుకొని ఆఖరి మ్యాచ్ పై అనేక ఆశలు పెట్టుకున్నారు. కాగా ఘన విజయంతో సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోహ్లీసేన, మరోవైపు వన్డే సిరీస్నైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఆతిథ్య జట్టు ఆరాటపడుతోంది.