ముంబై, జనవరి 17: ఓ ప్రముఖ టీవీ షోలో పాల్గొని మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తమ జీవితాలను వివాదంలోకి నెట్టుకున్నారు భారత యువ క్రికెటర్స్ రాహుల్, హార్దిక్ పాండ్య. ఈ వ్యాఖ్యల వల్ల వారిని క్రికెట్ నుండి కొంత కాలం బహిష్కరించిందే కాక మహిళలు, అభిమానుల నుండి తీవ్ర విమర్శలపాలవుతున్నారు. దీంతో మానసికంగా దెబ్బతిన్న పాండ్యాకు తోటి క్రికెటర్ శిఖర్ ధావన్ బాసటగా నిలిచాడు. పాండ్యాకు మానసిన స్థైర్యాన్ని పెంచే విధంగా మాట్లాడుతూ అతడి టీంఇండియా జట్టులో ఎంత కీలక ఆటగాడో ధావన్ వివరించాడు.
భారత జట్టులో ప్రస్తుతం ఆల్ రౌండర్గా హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడని ధావన్ పేర్కొన్నాడు. అతడు తన ధనా ధన్ బ్యాటింగ్ తో పాటు అవసరమైనప్పుడు బౌలింగ్ లోను తన సత్తా చాటగల ఆటగాడని ప్రశంసించాడు. భారత జట్టుకు సమతూకంలో వుండటంలో హార్దిక్ ముఖ్య భూమిక పోషించాడని ధావన్ కొనియాడారు.