జనవరి 12: సిడ్నీ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి వన్డే లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 29 ఓవర్లకు 136 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పాయారు. ఇండియా బౌలర్లలో భువనేశ్వర్ 4 ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి క్యాప్టెన్ ఫించ్ ని క్లీన్ బౌల్డ్ చేసాడు, వన్డే లో భువికి 100వ వికెట్. తరువాత మిచెల్ మార్ష్ స్థానంలో వచ్చిన డెబ్యు ఆటగాడు అలెక్స్ కేరి 24 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్ లో రోహిత్ శర్మ కి క్యాచ్ ఇచ్చి ఫెవిలియన్ చేరాడు. అర్థ శతకం చేసిన ఖవాజా జడేజా బౌలింగ్ లో ల్ బి డబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం గ్రీస్ లో షాన్ మార్ష్(47), పీటర్ హ్యాండ్స్కోంబ్(24) పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నారు