చైనా, జనవరి, 7: ఇండియాలో ఇప్పటికే షియోమీ పవర్ బ్యాంకులకు మంచి డిమాండ్ ఉంది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న షియోమీ... ఇటు పవర్ బ్యాంకులతోనూ యూజర్లను తమవైపు తిప్పుకుంటోంది.
20,000 ఎంఏహెచ్ కెపాసిటీ, లో పవర్ సపోర్ట్, 9 లేయర్స్ సర్క్యుట్ చిప్ ప్రొటెక్షన్, 45w ఫాస్ట్ ఛార్జింగ్ ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకత. యూఎస్బీ టైప్-ఏ పోర్ట్స్ రెండు ఉంటాయి. ఎంఐ పవర్ బ్యాంక్ 3 ప్రో పవర్ బ్యాంకుతో ఫోన్లు మాత్రమే కాదు యాప్ మ్యాక్ బుక్ ప్రో లాంటి నోట్బుక్స్, ల్యాప్టాప్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
షియోమీ ఫోన్లకు ఎంత డిమాండో ఆ కంపెనీ పవర్ బ్యాంకులకూ అంతే డిమాండ్. ఇప్పుడు మరో కొత్త పవర్ బ్యాంక్ని లాంఛ్ చేసింది షియోమీ. 45w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఎంఐ పవర్ బ్యాంక్ 3 ప్రో పవర్ బ్యాంకును చైనాలో లాంఛ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ mi.com వెబ్సైట్లో జనవరి 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ధర 199 చైనా యువాన్లు(రూ.2,015). ఈ పవర్ బ్యాంక్ త్వరలో ఇండియాలో లాంఛ్ కానుంది. షియోమీ గతంలో రిలీజ్ చేసిన పవర్ బ్యాంకులు మార్కెట్లో మంచి పోటీని ఇచ్చాయి. మరిన్ని కొత్త ఫీచర్లతో తీసుకొస్తున్న ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ యూజర్లను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.