ప్రముఖ మొబైల్స్ తయారీదారు జోలో.. ఎరా 4ఎక్స్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. రూ.4,444 ధరకే ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. జోలో ఎరా 4ఎక్స్ పేరిట విడుదలైన ఈ ఫోన్ అమెజాన్ వెబ్ సైట్లో ఈనెల 9 నుండి ప్రత్యేకంగా విక్రయించనున్నారు. ఇందులో 5.45 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా దానికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఈ రెండు కెమెరాలకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. ఈ ఫోన్లో డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ ఫీచర్ ఉంది. ఫేస్ అన్లాక్ సదుపాయాన్ని కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.
జోలో ఎరా 4ఎక్స్ ఫీచర్లు: