కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

SMTV Desk 2018-11-13 19:04:06  Hyderabad, Road accidents,

హైదరాబాద్, నవంబర్ 13: నగరంలోని కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ నుంచి కీసర‌వైపు వస్తున్న మారుతి ఆల్టో( టీఎస్ 07 ఎఫ్ ఎన్ 4548) కారు వేగంగా వస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు మూడునెలల పసికందు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఉప్పల్ అపోలో ఫార్మసీలో సెంట్రల్ మేనేజర్ గా పనిచేస్తున్న దినేశ్ కుమార్ తన భార్య సాగరిక మూడు నెలల బాబు రుషీకేశ్‌తో కారులో వెళ్తుండగా.. రాంపల్లి దయార బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతులు ఝార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.