హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా తెరాస అభ్యర్దుల జాబితా విడుదల క్రమంలో అసమ్మతి సెగలు క్రమంగా చల్లారాయనుకొంటే ఇవాళ్ళ మళ్ళీ హటాత్తుగా తీవ్రస్థాయిలో అసమ్మతి స్వరాలు వినిపించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి తన అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది తెరాస కూడా మిగిలిన 12 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడానికి సిద్దంగా ఉంది. కనుక తెరాసలో ఆ 12 స్థానాలలో టికెట్లు ఆశిస్తున్నవారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
వారిలో మన్నే గోవర్ధన్ రెడ్డి కూడా వొకరు. ఆయన ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని దానం నాగేందర్ కు కేటాయించవచ్చనే అనుమానంతో సోమవారం మధ్యాహ్నం ఆయన అనుచరులు తెలంగాణభవన్ వద్దకు చేరుకొని తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. మొదటి నుంచి తెరాసలో పనిచేస్తున్న గోవర్ధన్ రెడ్డిని కాదని, కొత్తగా పార్టీలో చేరిన దానం నాగేందర్ లేదా మరెవరికైనా టికెట్ కేటాయిస్తే సహించబొమని వారు హెచ్చరించారు.
కానీ ఖైరతాబాద్ టికెట్ హామీతోనే దానం నాగేందర్ తెరాసలో చేరినట్లు సమాచారం. కనుక దానంకు టికెట్ కేటాయించకపోతే ఆయన కూడా ఊరుకోరు. కనుక గోవర్ధన్ రెడ్డినే బుజ్జగిస్తారేమో?