ఛత్తీస్గఢ్, నవంబర్ 12: ఎన్నికల వేల కాంగ్రెస్ పార్టీ కి చేదు అనుభవం ఎదురయింది. కాంగ్రెస్ పార్టీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి దామోదర రాజనరసింహ సతీమణి పద్మినీ కాంగ్రెస్ పార్టీని వీడి కమలం కండువ కప్పుకుని సాయంత్రానికి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. దీనిపై తెలంగాణలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఘనరామ్ సాహు తనకు దుర్గ్ నియోజకవర్గం టిక్కెట్ కేటాయించలేదనే అసంతృప్తితో నిన్న సాయంత్రం కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి అమిత్ షా ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నాడు. సోమవారం ఛత్తీస్గఢ్లోని 90 అసెంబ్లీ స్థానాలకు తొలివిడత 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడే పార్టీ మారడం సంచలనం రేకెత్తిస్తోంది.