న్యూ ఢిల్లీ, నవంబర్ 12: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో నిలకడగా ఆడుగుతున్నా టెస్ట్ జట్టులో మాత్రం అతనికి స్థానం దక్కడం లేదు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో వెంటనే అతనిపై వేటు వేశారు. తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు కూడా ఎంపిక చేయలేదు. దీనిపై మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.అసలు సఫారీ గడ్డపై ఎంతమంది బ్యాట్స్మెన్ రాణించారు? అలాంటిది కేవలం అతనినే ఎందుకు తప్పించారు..? అని ప్రశ్నించాడు. రోహిత్ వన్డేల్లో ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తూ.. టెస్టుల్లో చోటు దక్కని ఆటగాడు నాకు తెలిసి ప్రపంచ క్రికెట్లో ఎవరూ లేరన్న సెహ్వాగ్.. ఇటీవల ఆసీస్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు రోహిత్కు చోటు కల్పించడంతో అతను తుది జట్టులో ఉండాలని అభిప్రాయపడ్డాడు.