తుదిశ్వాస విడిచిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్

SMTV Desk 2018-11-12 15:24:10  Ananth Kumar, Central Minister, BJP Leader, Died, Lokhsabha

బెంగుళూరు, నవంబర్ 12: బిజెపి సీనియర్ నేత, కేంద్రమంత్రి అనంత్ కుమార్(60) ఈ రోజు ఉదయం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనంత్ కుమార్ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ఈక్రమంలో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో మంత్రి క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు.

ఆయన ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1959 సెప్టెంబర్ 22న అనంత్ కుమార్ బెంగళూరులో జన్మించారు. వాజ్‌పేయ్ హయాంలో విమానయాన మంత్రిగా అనంత్ కుమార్ పనిచేశారు. 2014లో కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంత్.. జులై 2016 నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.