హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పై మేకల మహష్ యాదవ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ఇతను ఇదివరకు ఈటల వద్ద కారు డ్రైవరుగా పనిచేసాడు.
అయితే శుక్రవారం మల్లేష్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ “నేను చాలా కాలంపాటు ఈటల కారు డ్రైవరుగా పనిచేశాను. ఉద్యమ సమయంలో అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజుల పాటు జైలు జీవితం గడిపినందుకు నా ఉద్యోగం పోయింది. అప్పుడు ఉద్యమాలకు మద్దతు పలుకుతున్న కొంతమంది పెద్దలందరూ కలిసి నా కుటుంబపోషణకు రూ.30 లక్షలు విరాళంగా అందించారు. కానీ దానిని కూడా ఆయనే తీసేసుకొన్నారు. ఆ డబ్బు నాకు ఇవ్వలేదు కనీసం ప్రభుత్వోద్యోగం కల్పించకపోవడంతో నా కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. అప్పటి నుంచి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కూలిపనికి వెళుతున్నాను. తెలంగాణ సాధన కోసం పొరాడి జైలుకు వెళ్ళిన నావంటివారు ఎందరో నాలాగే దరిద్రం అనుభవిస్తున్నారు. మాకు ఈటల రాజేందర్, ఆయన అనుచరులు చాలా అన్యాయం చేశారు. అందుకే ఈసారి ఎన్నికలలో నేను అతని పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకొంటున్నాను,” అంటూ చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.