ప్రముఖ తెదేపా నేతను హతమార్చిన దుండగులు

SMTV Desk 2018-11-10 17:16:36  TDP Follower, Muredr, Devanakonda, Venkatapuram

కర్నూలు, నవంబర్ 10: దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో తెదేపా నేత, సోమేశ్ గౌడ్ ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఇతను ఉపముఖ్యమంత్రి కేఈ ముఖ్య అనుచరుడు గా ఉండేవాడు. శుక్రవారం రాత్రి మద్యం షాపును మూసి.. తన కుమారుడితో కలిసి బైకుపై ఇంటికి వెళ్లున్న సోమేశ్‍ను దుండగులు వెంటాడుతూ..కళ్లల్లో కారం చల్లి వేట కొడవలితో దారుణంగా నరికి చంపడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.

ఈ ఘటనలో అతని కుమారుడికి కూడా గాయాలయ్యాయి. సోమేశ్వర గౌడ్ దేవనకొండ మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.