చెన్నై, నవంబర్ 10: ఈ నెల విడుదలకి సిద్దంగా ఉన్న చిత్రం రోబో 2.O. శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళ్ రాకర్స్ అనే వెబ్ సైట్ దీన్ని పైరసీ చేసి విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇది వరకు తలపతి విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ సినిమాని రిలీస్ కి ముందే పైరసీ చేస్తామని చెప్పి అన్నంత పనే చేశారు. తాజాగా ఇప్పుడు రోబో 2.O వంతు అంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. వీరి పట్ల నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. వీరి చేసే విధానం పట్ల తమిళ చిత్ర బృందాలు భయాందోలనకు గురవుతున్నారు.