న్యూ ఢిల్లీ, నవంబర్ 1: రానున్న ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోది సోదరుడు తనకు వ్యతిరేకంగా వారణాసిలో ఎన్నికల ప్రచారం చేస్తా అని చెపుతున్నారు. ప్రహ్లాద్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. రేషన్ డీలర్ల జాతీయ సమాఖ్య అధ్యక్షుడైన ప్రహ్లాద్ మోదీ.. తర్వలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరనున్నారు. ఈమేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రహ్లాద్ మొదట బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై వచ్చిన నకిలీ డిగ్రీ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.తర్వాత మోదీ విధానాలను విమర్శించి తర్వత స్తబ్దుగా ఉండిపోయారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో మళ్లీ క్రియాశీలమయ్యారు.