విసుగెత్తి 100 కు పైగా హత్యలు చేశాడు

SMTV Desk 2018-10-31 18:40:37  Germany, E Malse Nurse, Murders, Court, Jails,

జర్మనీ, అక్టోబర్ 31: జర్మనీకి చెందిన ఈ మేల్ నర్సు ఇతడు 100 కు పైగా రోగులను ఉబుసుపోక చంపేశానని మంగళవారం కోర్టుకు వెల్లడించాడు. జర్మనీలో రెండో ప్రపంచం యుద్ధం తర్వాత అతి పెద్ద సమూహిక మారణకాండగా భావిస్తున్న ఈ కేసులో తొలి విచారణ ఇది. 41 ఏళ్ల హోగెల్ హత్య కేసుల్లో పదేళ్లుగా జైల్లో ఉంటున్నాడు. అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కేసులు వెలుగు చూస్తుండంతో అతనికి మళ్లీ శిక్షలు పడుతున్నాయి.

ఓల్డెన్ బర్గ్ లో పనిచేసే సమయంలో అతడు 36 మందిని రోగులను చంపేశాడు. డెల్మెన్ హోర్స్ట్‌లో 64 మందిని హతమార్చాడు. అన్నింటికీ రెండే కారణాలు.. ‘నాకు విసుగెత్తేది. ఏం చేయాలో తోచక ఓవర్ డోస్ మందులు ఇచ్చి చంపేవాణ్ని. కొందర్ని చావు నుంచి కాపాడ్డానికి డోస్ ఎక్కువ ఇచ్చేవాడిని.. ఇందుకు విచారిస్తున్నాను.. ’ అని హోగెల్ వెల్లడించాడు. అయితే అతడు అంతటి ఘోరాలకు పాల్పడుతుంటే ఆస్పత్రి ఇబ్బంది ఏం చేశారన్నది బాధితులు నిలదీస్తున్నారు. హోగెల్ వంద కాదు, 200 మందిని చంపేసి ఉంటాడని, అనుమానాస్పద మరణాలుగా భావించిన కేసుల్లో మృతదేహాలను వెలికి తీసి మళ్లీ పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.