100కి 98 మార్కులు సాధించిన వృద్ధురాలు

SMTV Desk 2018-10-31 17:57:52  Kerala, Akshara lakshyam scheme, Karthiyamma

కేరళ, అక్టోబర్ 31: కేరళ ప్రభుత్వం వయోజనులకు నిర్వహించిన అక్షరలక్షం పరీక్షంలో కార్తియాని అనే వొక వృద్ధురాలు 100కు 98 మార్కులతో సాదించి అందరిని ఆకర్షితులను చేసింది. ఈ పరీక్షరాసిన వారిలో ఆమె అత్యంత పెద్ద వయసు వ్యక్తి. రాయడం, చదవడం, చిన్నపాటి లెక్కలు చేయడంలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది.

ఈ విజయ బామ్మకు పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. కార్తియమ్మ.. ఇటీవల పరీక్షా కేంద్రానికి వెళ్లినప్పుడే వార్తల్లోకి ఎక్కింది. మునిమనవల వయసున్న వారితో కలసి పరీక్షలు రాసింది. సాక్షరతా కార్యక్రమానికి హాజరైన కార్తియాని అమ్మ గణితం, చదవడం, రాయడంపైపట్టు సాధించింది.