టైటిల్‌ ట్రోఫీని పంచుకున్న భారత్-పాక్‌లు

SMTV Desk 2018-10-29 11:22:21  asia championship trophy, bharath, pakisthan

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 29: భారత్ - పాకిస్థాన్ తో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో టైటిల్ పోరుకు సిద్దమై ఆదివారం జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో రెండు జట్లు ట్రోఫీని పంచుకున్నాయి.

మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత్‌ లీగ్‌ దశలో పాకిస్థాన్‌ను వోడించిన సంగతి తెలిసిందే. మరోవైపు జపాన్‌ జట్టు కాంస్యం గెలుచుకుంది. వర్షానికి ముందు జరిగిన పోరులో జపాన్‌ షూటాఫ్‌లో 3-2తో మలేసియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలవడంతో ఆట షూటాఫ్‌కు దారితీసింది.