కర్నూల్,అక్టోబర్ 02 :వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మంగళవారం నందికొట్కూరు యువనేస్తం కార్యక్రమంలో పాల్గొని రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇచ్చి వెయ్యికి కోత పెట్టడం సరికాదు అన్నారు . ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్యపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు.ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని ఆపివేశారు ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేస్తున్న కానీ అక్కడున్న పోలీసులు, అధికారులు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే సభను బాయ్కట్ చేసి వెళ్లిపోయారు .